Thursday, January 19, 2012

కాపుల అణచివేతకు కుట్ర

జనాభాలో 4 శాతం వున్న ఆధిపత్య కులాలు బీసీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ బీసీలను రాజకీయంగా అణగదొక్కడానికి కుట్ర చేస్తున్నాయని కాపునాడు ఆంధ్రప్రదేశ్‌ ఛైర్మన్‌ మి ర్యాల వెంకట్రావ్‌ ఆరోపించారు. ఆధిపత్య కులాలు తమ ఉనికిని కాపా డుకోవడం కోసం, ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి అత్యధికంగా 27 శాతం వున్న బీసీలను, ఇతర కులాలను అణగదొక్కడానికి కుట్రలు, కు యుక్తులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బుధవారం లోయర్‌ ట్యాం క్‌బండ్‌లోని ఓ హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ నేతృత్వంలోని కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ కాపులను అణిచివేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల పీసీసీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన బొ త్స సత్యనారాయణను దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి పడరాని పాట్లు పడు తున్నారని, అదేవిధంగా చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని వెంకట్రావ్‌ దుయ్యబట్టారు.

గతంలో రాయలసీమ నుం చి కేంద్ర మంత్రి పదవిని చేపట్టిన సాయిప్రతాప్‌ను మంత్రి పదవి నుంచి తొలగించడానికి ఈ ఆధిపత్య కులాలు కుట్ర చేశాయని, వారి ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం కాపు, బలిజలను కాంగ్రెస్‌ పార్టీకి దూరం చేస్తు న్నారని, ఇలాంటి వివక్షతను ప్రదర్శించి కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు. కాపుల మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ గుర్తించుకోవాలని వెంకట్రావ్‌ హితవు పలికారు.

మంత్రులకు శాఖల కేటాయింపులో వివక్షత
ముఖ్యమంత్రి బీసీ కులాలకు చెందిన మంత్రులకు శాఖల కేటాయిం పులోనూ వివక్షతను చూపారని, ఆధిపత్యకులాలకు కీలకశాఖలను కేటా యించి కులహంకారానికి పాల్పడ్డారని, కన్నా లక్ష్మినారాయణ, వట్టి వసం తకుమార్‌, పొన్నాల లక్ష్మయ్యవంటి కాపు మంత్రులకు అప్రధానమైన శాఖలను కేటాయించి తన వర్గానికి ఆర్థిక, హోం శాఖలను కేటాయిం చు కున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి అవలంభిస్తున్న బీసీ వ్యతి రేఖ విధానాలపై ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్‌ పార్టీ అధి ష్టానానికి వినతిపత్రం సమర్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. త్వరలో జరు గబోయే మంత్రివర్గ విస్తరణలో జనాభా ప్రాతిపదికన కాపు కులస్తులకు ఎనిమిది మంత్రి పదవులను ఇవ్వాలని అదేవిధంగా మూడు రాజ్యసభ స్థా నాలు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో డా వెంకటేశ్వర్‌రావు, చందార్‌రావు, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

చిన్న చిన్న సభలు సమేవేసలు పెట్టండి

చిన్న చిన్న సభలు సమేవేసలు పెట్టండి

అన్ని కులాలకి మనమే ఆధారం

అన్ని కులాలకి మనమే ఆధారం

నీతి నిజయితలకు మరు పేరు

నీతి నిజయితలకు మరు పేరు

చిరుపై ‘దాసరి’ అస్త్రం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. అధిష్ఠానం వద్ద తన పలుకుబడి తగ్గకుండా చూసుకుంటూనే, ఎందుకైనా మంచిదన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతానికి తెర తీశారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతు న్నాయి. తన ప్రభుత్వాన్ని అస్థిర పరచటానికి, పీఠం కిందకు నీళ్ళు తేవటానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కొత్తగా పార్టీలో చేరిన చిరంజీవి పావులు కదుపు తున్నారన్న అనుమానంతో ఉన్న కిరణ్‌, అందుకు ప్రతిక్రియ ప్రారంభించినట్టు పార్టీలో చెప్పుకుంటున్నారు. ఈ ప్రతివ్యూహంలో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణరావును ముఖ్యమంత్రి రంగంలోకి దించినట్టు ప్రచారం జరుగుతోంది.

దాసరి లేఖాస్త్రం... సంక్రాంతి తర్వాత తన వర్గానికి మంత్రి పదవులు వస్తాయని ఆశిస్తున్న చిరంజీవి, తనకు అత్యంత సన్నిహితుడైన సీ రామచంద్రయ్యకు పదవి దక్కటాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ నేతలపై ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేయటానికి దాసరి నారాయణ రావు రంగ ప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. తాజాగా దాసరి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి శుక్రవారం ఒక లేఖ రాశారని, అందులో ఒకరిని అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరత్వంపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారని బయటకు పొక్కింది. అందులో చిరంజీవి పేరు ఉన్నదీ లేనిదీ తెలియకపోయినప్పటికీ ఆయనపై ఫిర్యాదు చేసేందుకే దాసరి లేఖాస్త్రాన్ని ప్రయోగించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పనిలో పనిగా చిరంజీవికి మద్దతుదారుగా నిలిచిన బొత్సపై సైతం దాసరి ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి వ్యూహంలో భాగమే?
chirusగత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి, ఇటీవలే సతీ వియోగంతో నిర్వేదంగా ఉన్న దాసరి ఒక్కసారిగా ఈ లేఖ రాయటం పార్టీ వర్గాలలో సంచలనం కలిగించింది. ఆయన మరోసారి రాజ్యసభ టికెట్‌ ఆశిస్తున్నందువల్లనే ఈ లేఖ రాశారని కొందరు అంటుంటే, మరి కొందరు ఇది ముఖ్యమంత్రి వ్యూహంలో భాగం అని వ్యాఖ్యానిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి తానే బలమైన నేత అనిపించుకునేందుకు చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలు, నిన్న గాక మొన్న పార్టీలో చేరిన వెంటనే తన మాట నెగ్గాలంటున్న ఆయన మంకుపట్టు, అన్నిటికీ మించి కంటిలో నలుసు మాదిరిగా ఉన్న బొత్సతో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటూ తనపై సవారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆగ్రహం కిరణ్‌లో ఉంది. ఆయనను అడ్డుకునేందుకు దీటైన వారు ఎవరా అని ఆలోచించిన కిరణ్‌, అదే కాపు సామాజిక వర్గానికి చెంది, సినీ రంగంలో లబ్ధ ప్రతిష్ఠుడైన దాసరి నారాయణరావును అస్త్రంగా ప్రయోగిస్తే అధిష్ఠానం సైతం ఆయన మాటకు విలువ ఇస్తుందనుకున్నారని, అదే అదనుగా దాసరితో సంప్రదించి లేఖ రాయించారన్న ప్రచారం పార్టీ వర్గాలలో జోరుగా సాగుతున్నది.

నేనెరుగ...నేనెరుగ...
ఒకవైపు చిరంజీవి, మరోవైపు బొత్సను టార్గెట్‌గా చేసుకుని ముఖ్యమంత్రి ఈ పదునైన దాసరి అస్త్రాన్ని ప్రయోగించారన్న ప్రచారం సాగుతుంటే, బొత్స సత్యనారాయణ మాత్రం తనకేమీ తెలియదన్నట్టు అమాయకత్వం ప్రదర్శించారు. రాజ్యసభ సభ్యుడుగా అధినేత్రికి లేఖ రాయటానికి దాసరి సర్వ హక్కులూ కలిగి ఉన్నారని, ఒకరిని అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాశారంటే అది ఆయన అభిప్రాయం కావచ్చుననీ బొత్స మీడియాతో చెప్పారు.

కాపుల్లో కోపం ఎక్కువ

కాపుల్లో కోపం ఎక్కువ

చట్రంలో చిరు?

కాంగ్రెస్‌లో ఎదిగే క్రమంలో ఉన్న చిరంజీవి కొందరి చట్రంలో చిక్కుకుంటున్నారా? పీఆర్పీ తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన జూనియర్‌ మేధావులు ఆయన ఎదు గుదలను తమ స్వార్ధం కోసం ఒక వ్యూహం ప్రకారం అడ్డుకుంటున్నారా? చిరుపై కులంముద్ర వేయడం ద్వారా ఆయనను ఒక కులానికే పరిమితం చేసి కొందరివాడిగా మార్చేందుకు సిద్ధమవుతున్నారా? కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాలను శాసించే అవకాశం వచ్చిన ఆయ నకు చుట్టూ ఉన్న కోటరీ అవరోధంగా పరిణమించిందా? రాజకీయ అనుభవజ్ఞులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు, జర్న లిస్టులు దరికి చేరితే తమ మనుగడకు ప్రమాదమన్న దూరదృష్టితో వారిని జూనియర్‌ మేధావులు అడ్డుకుంటు న్నారా?.. గత కొద్దిరోజుల నుంచి తమ పార్టీలో జరుగు తున్న అంతర్మథనమిది
కాంగ్రెస్‌ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న చిరంజీవిని ఎదగనీయకుండా ఆయన చుట్టూ ఒక కోటరీ ఏర్పడిం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి చిరంజీవికి రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయాలతో పాటు, ఇతర పార్టీ పరిణామాలేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ, ఆయన చుట్టూ చేరిన కొందరు నేతలు ఆయన చుట్టూ అడ్డుగోడలా నిలుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీఆర్పీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఈ జూనియర్‌ శక్తులు తాము ఒక్కరే చిరంజీవి దృష్టిలో మేధావులుగా ముద్ర వేయించుకోవాలన్న దూరదృష్టితో ఇతరులను రానీయకుండా సైంధవ పాత్ర పోషిస్తున్నారంటున్నారు. పైగా తమకు అనుకూలంగా ఉండే వారిని చుట్టూ నియమించే వ్యూహంతో ఉన్నారు.

ఇటీవల తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఇతర జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం తమ మనోభావాలు తెలిపేందుకు ప్రయత్నించగా, సదరు జూనియర్‌ మేధావులే చిరంజీవికి అడ్డుగోడగా నిలిచారన్న ఆరోపణలున్నాయి. చిరంజీవి వద్ద కొత్త వారు చేరితే తమ పట్టు ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతోనే ఈ జూనియర్‌ మేధావులు అటు సీనియర్‌ నాయకులను, ఇటు జర్నలిస్టులను చిరు వద్దకు చేరకుండా సైంధవపాత్ర పోషిస్తున్నారంటున్నారు. గతంలో ఎలాంటి రాజకీయానుభవం గానీ, రాష్ట్ర స్థాయి రాజకీయాలను విశ్లేషించే అనుభవం గానీ లేని ఈ జూనియర్‌ మేధాలవుల వల్ల చిరంజీవి ఒక చట్రంలో ఇరుక్కుపోతున్నారన్న ఆవేదన పీఆర్పీ నేతల్లో వ్యక్తమవుతోంది. వీరిని వదిలించుకుని, అందరితో మమేకం కాకపోతే కాంగ్రెస్‌లో మనుగడ కష్టమంటున్నారు.

ఇక ధృతరాష్ట్ర కౌగిలి వంటి కాంగ్రెస్‌ నీడలో చిరంజీవి ఉన్నంతకాలం ప్రతిదీ సునిశితంగా పరిశీలించాలంటున్నారు. చిరంజీవి కాంగ్రెస్‌లో చేరినందున కాపులు కాంగ్రెస్‌కు పెద్ద ఓటు బ్యాంకుగా మారారు. ఇది కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కమ్మ, రెడ్డి, దళిత వర్గాల నాయకులకూ కలసిరానుంది. ప్రతి నియోజకవర్గంలోనూ కాపుల ఓట్లు కనీసం 20-25 వేల వరకూ ఉన్నాయి. తమ సామాజికవర్గ ఓట్లతో పాటు కాపు ఓట్లు కూడా అనుకూలిస్తేనే తాము గెలుస్తామన్న ముందుచూపుతో చాలామంది కాపేతర నాయకులు, మంత్రులు సైతం చిరంజీవి సాన్నిహిత్యం కోసం తపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో తూర్పు కాపుల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చిరు తమ వైపు ఉంటే బయటపడతామన్న భావనతో ఉన్నారు. అయితే, ఈ వాస్తవాన్ని గ్రహించకుండా, చిరంజీవిని కేవలం ఒక కాపులకే పరిమితం చేసి, ఆయనను కొందరివాడిగా చేసే ప్రయత్నాలు సొంత కోటరీ లోనే జరుగుతోందంటున్నారు.

చిరంజీవి కంటే దశాబ్దాల ముందే రాజకీయాల్లో ఉంటూ కాపు నాయకులుగా ముద్ర పడిన వంగవీటి మోహనరంగా, ముద్రగడ పద్మనాభం వంటి పెద్ద నేతలకు ప్రజాకర్షణ, ఇమేజ్‌ ఉన్నప్పటికీ కేవలం కాపు నేతలన్న కుల ముద్ర ఉండటం వల్లే రాణించలేకపోయారని విశ్లేషిస్తున్నారు. వంగవీటి జీవించినంతకాలం పోరాడగా, ముద్రగడను ఇప్పటికీ ఏ రాజకీయపార్టీ ఆదరించేందుకు సాహసించలేకపోతోందని గుర్తు చేస్తున్నారు. నిజానికి, చిరంజీవి పీఆర్పీ స్థాపించిన తర్వాత కాపులకు గుర్తింపు కంటే రాజకీయంగా నష్టమే ఎక్కువ జరిగిందన్న ఆవేదన ఇప్పటికీ వినిపిస్తోంది. కాంగ్రెస్‌-టీడీపీలో ఒక వెలుగు వెలిగి.. వైఎస్‌, బాబు ఎంత నచ్చచెప్పినా వినకుండా కేవలం కులాభిమానంతో ఆయా పార్టీలకు రాజీనామా చేసి మరీ బయటకువచ్చిన వారి రాజకీయ జీవితాలు ప్రస్తుతం డోలాయమానంలో పడ్డాయని విశ్లేషిస్తున్నారు.

కొత్తపల్లి సుబ్బారాయుడు, మళ్లీ టీడీపీలో చేరిన కళావెంకట్రావు, కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన బూరగడ్డ వేదవ్యాస్‌ వంటి సీనియర్లు ఆయా పార్టీల్లోనే కొనసాగిఉంటే వారికి కనీస గుర్తింపయినా వచ్చి ఉండేదంటున్నారు. ఈ దృష్ట్యా కులముద్ర వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువంటున్నారు.
చిరంజీవికి 17 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్న కారణంతోనే కాంగ్రెస్‌ ఆయన పార్టీని విలీనం చేసుకుని రెండు పదవులు ఇచ్చింది తప్ప, చిరుపై ప్రేమతో కాదన్నది నిర్వివాదం. అయితే, చిరంజీవి విస్తరణ సమయంలో కేవలం ఇద్దరినే సిఫారసు చేయడం ద్వారా మిగిలిన వారిని దూరం చేసుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శాసనసభలో ఉన్న ఆ కొద్దిపాటి న్యాయపరమైన చిక్కు కూడా తొలగిపోతే, ఇక అంతా అధికారికంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలవుతారు. అప్పుడు చిరంజీవి వెంట ఉన్న ఇప్పటి 14 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట శాశ్వతంగా ఉంటారన్న నమ్మకం లేదు. కాంగ్రెస్‌లో ఢిల్లీ లాబీ ఉన్నవారికే పదవులు వస్తాయి కాబట్టి, అంతా ఢిల్లీలోనో, ఇక్కడ సీఎం స్థాయిలోనో కొత్త గాడ్‌ఫాదర్లను ఎంచుకుంటారు. ఇప్పటికే కొందరు నేరుగా సీఎంతో సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే.

అప్పుడు చిరంజీవికి సొంతంగా ఎలాంటి బలమూ ఉండదు. మళ్లీ కాంగ్రెస్‌లోనే కొత్త శక్తులను సమీకరించుకోవలసి వస్తుంది. చిరు మనస్తత్వం ప్రకారం అది చాలా కష్టమని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. సొంత బలం, బలగం లేకపోతే కాంగ్రెస్‌లో గుర్తింపు కష్టం. ఈ క్రమంలో చిరంజీవి సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం భవిష్యత్తులో ఎప్పటికయినా మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. విస్తరణలో చిరు సిఫారసు వల్ల సొంత పార్టీ నేతలు ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా అధికారికంగా కాంగ్రెస్‌లో విలీన వార్త కోసం ఎదురుచూస్తున్నారు. అది పూర్తయితే ఇక చిరంజీవిని విడిచి కాంగ్రెస్‌లో కొత్త దేవుళ్ల కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది. ప్రజాకర్షణ, నిబద్ధత ఉన్న ఎన్టీఆర్‌ లాంటి ఇమేజ్‌ ఉన్న వారే రాజకీయాల్లో తప్పటడుగులు వేస్తే తిరుగుబాటు తప్పలేదని, రెండేళ్లు కూడా పార్టీని నడిపించలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటున్న చిరంజీవి అన్న గారి కంటే ఎక్కువకాదని చిరు ఎదుగుదలను కోరుకునే ఆయన సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు.