Thursday, January 19, 2012

కాపుల అణచివేతకు కుట్ర

జనాభాలో 4 శాతం వున్న ఆధిపత్య కులాలు బీసీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ బీసీలను రాజకీయంగా అణగదొక్కడానికి కుట్ర చేస్తున్నాయని కాపునాడు ఆంధ్రప్రదేశ్‌ ఛైర్మన్‌ మి ర్యాల వెంకట్రావ్‌ ఆరోపించారు. ఆధిపత్య కులాలు తమ ఉనికిని కాపా డుకోవడం కోసం, ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి అత్యధికంగా 27 శాతం వున్న బీసీలను, ఇతర కులాలను అణగదొక్కడానికి కుట్రలు, కు యుక్తులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బుధవారం లోయర్‌ ట్యాం క్‌బండ్‌లోని ఓ హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ నేతృత్వంలోని కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ కాపులను అణిచివేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల పీసీసీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన బొ త్స సత్యనారాయణను దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి పడరాని పాట్లు పడు తున్నారని, అదేవిధంగా చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని వెంకట్రావ్‌ దుయ్యబట్టారు.

గతంలో రాయలసీమ నుం చి కేంద్ర మంత్రి పదవిని చేపట్టిన సాయిప్రతాప్‌ను మంత్రి పదవి నుంచి తొలగించడానికి ఈ ఆధిపత్య కులాలు కుట్ర చేశాయని, వారి ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం కాపు, బలిజలను కాంగ్రెస్‌ పార్టీకి దూరం చేస్తు న్నారని, ఇలాంటి వివక్షతను ప్రదర్శించి కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు. కాపుల మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ గుర్తించుకోవాలని వెంకట్రావ్‌ హితవు పలికారు.

మంత్రులకు శాఖల కేటాయింపులో వివక్షత
ముఖ్యమంత్రి బీసీ కులాలకు చెందిన మంత్రులకు శాఖల కేటాయిం పులోనూ వివక్షతను చూపారని, ఆధిపత్యకులాలకు కీలకశాఖలను కేటా యించి కులహంకారానికి పాల్పడ్డారని, కన్నా లక్ష్మినారాయణ, వట్టి వసం తకుమార్‌, పొన్నాల లక్ష్మయ్యవంటి కాపు మంత్రులకు అప్రధానమైన శాఖలను కేటాయించి తన వర్గానికి ఆర్థిక, హోం శాఖలను కేటాయిం చు కున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి అవలంభిస్తున్న బీసీ వ్యతి రేఖ విధానాలపై ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్‌ పార్టీ అధి ష్టానానికి వినతిపత్రం సమర్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. త్వరలో జరు గబోయే మంత్రివర్గ విస్తరణలో జనాభా ప్రాతిపదికన కాపు కులస్తులకు ఎనిమిది మంత్రి పదవులను ఇవ్వాలని అదేవిధంగా మూడు రాజ్యసభ స్థా నాలు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో డా వెంకటేశ్వర్‌రావు, చందార్‌రావు, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

చిన్న చిన్న సభలు సమేవేసలు పెట్టండి

చిన్న చిన్న సభలు సమేవేసలు పెట్టండి

అన్ని కులాలకి మనమే ఆధారం

అన్ని కులాలకి మనమే ఆధారం

నీతి నిజయితలకు మరు పేరు

నీతి నిజయితలకు మరు పేరు

చిరుపై ‘దాసరి’ అస్త్రం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. అధిష్ఠానం వద్ద తన పలుకుబడి తగ్గకుండా చూసుకుంటూనే, ఎందుకైనా మంచిదన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతానికి తెర తీశారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతు న్నాయి. తన ప్రభుత్వాన్ని అస్థిర పరచటానికి, పీఠం కిందకు నీళ్ళు తేవటానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కొత్తగా పార్టీలో చేరిన చిరంజీవి పావులు కదుపు తున్నారన్న అనుమానంతో ఉన్న కిరణ్‌, అందుకు ప్రతిక్రియ ప్రారంభించినట్టు పార్టీలో చెప్పుకుంటున్నారు. ఈ ప్రతివ్యూహంలో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణరావును ముఖ్యమంత్రి రంగంలోకి దించినట్టు ప్రచారం జరుగుతోంది.

దాసరి లేఖాస్త్రం... సంక్రాంతి తర్వాత తన వర్గానికి మంత్రి పదవులు వస్తాయని ఆశిస్తున్న చిరంజీవి, తనకు అత్యంత సన్నిహితుడైన సీ రామచంద్రయ్యకు పదవి దక్కటాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ నేతలపై ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేయటానికి దాసరి నారాయణ రావు రంగ ప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. తాజాగా దాసరి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి శుక్రవారం ఒక లేఖ రాశారని, అందులో ఒకరిని అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరత్వంపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారని బయటకు పొక్కింది. అందులో చిరంజీవి పేరు ఉన్నదీ లేనిదీ తెలియకపోయినప్పటికీ ఆయనపై ఫిర్యాదు చేసేందుకే దాసరి లేఖాస్త్రాన్ని ప్రయోగించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పనిలో పనిగా చిరంజీవికి మద్దతుదారుగా నిలిచిన బొత్సపై సైతం దాసరి ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి వ్యూహంలో భాగమే?
chirusగత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి, ఇటీవలే సతీ వియోగంతో నిర్వేదంగా ఉన్న దాసరి ఒక్కసారిగా ఈ లేఖ రాయటం పార్టీ వర్గాలలో సంచలనం కలిగించింది. ఆయన మరోసారి రాజ్యసభ టికెట్‌ ఆశిస్తున్నందువల్లనే ఈ లేఖ రాశారని కొందరు అంటుంటే, మరి కొందరు ఇది ముఖ్యమంత్రి వ్యూహంలో భాగం అని వ్యాఖ్యానిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి తానే బలమైన నేత అనిపించుకునేందుకు చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలు, నిన్న గాక మొన్న పార్టీలో చేరిన వెంటనే తన మాట నెగ్గాలంటున్న ఆయన మంకుపట్టు, అన్నిటికీ మించి కంటిలో నలుసు మాదిరిగా ఉన్న బొత్సతో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటూ తనపై సవారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆగ్రహం కిరణ్‌లో ఉంది. ఆయనను అడ్డుకునేందుకు దీటైన వారు ఎవరా అని ఆలోచించిన కిరణ్‌, అదే కాపు సామాజిక వర్గానికి చెంది, సినీ రంగంలో లబ్ధ ప్రతిష్ఠుడైన దాసరి నారాయణరావును అస్త్రంగా ప్రయోగిస్తే అధిష్ఠానం సైతం ఆయన మాటకు విలువ ఇస్తుందనుకున్నారని, అదే అదనుగా దాసరితో సంప్రదించి లేఖ రాయించారన్న ప్రచారం పార్టీ వర్గాలలో జోరుగా సాగుతున్నది.

నేనెరుగ...నేనెరుగ...
ఒకవైపు చిరంజీవి, మరోవైపు బొత్సను టార్గెట్‌గా చేసుకుని ముఖ్యమంత్రి ఈ పదునైన దాసరి అస్త్రాన్ని ప్రయోగించారన్న ప్రచారం సాగుతుంటే, బొత్స సత్యనారాయణ మాత్రం తనకేమీ తెలియదన్నట్టు అమాయకత్వం ప్రదర్శించారు. రాజ్యసభ సభ్యుడుగా అధినేత్రికి లేఖ రాయటానికి దాసరి సర్వ హక్కులూ కలిగి ఉన్నారని, ఒకరిని అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాశారంటే అది ఆయన అభిప్రాయం కావచ్చుననీ బొత్స మీడియాతో చెప్పారు.

కాపుల్లో కోపం ఎక్కువ

కాపుల్లో కోపం ఎక్కువ

చట్రంలో చిరు?

కాంగ్రెస్‌లో ఎదిగే క్రమంలో ఉన్న చిరంజీవి కొందరి చట్రంలో చిక్కుకుంటున్నారా? పీఆర్పీ తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన జూనియర్‌ మేధావులు ఆయన ఎదు గుదలను తమ స్వార్ధం కోసం ఒక వ్యూహం ప్రకారం అడ్డుకుంటున్నారా? చిరుపై కులంముద్ర వేయడం ద్వారా ఆయనను ఒక కులానికే పరిమితం చేసి కొందరివాడిగా మార్చేందుకు సిద్ధమవుతున్నారా? కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాలను శాసించే అవకాశం వచ్చిన ఆయ నకు చుట్టూ ఉన్న కోటరీ అవరోధంగా పరిణమించిందా? రాజకీయ అనుభవజ్ఞులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు, జర్న లిస్టులు దరికి చేరితే తమ మనుగడకు ప్రమాదమన్న దూరదృష్టితో వారిని జూనియర్‌ మేధావులు అడ్డుకుంటు న్నారా?.. గత కొద్దిరోజుల నుంచి తమ పార్టీలో జరుగు తున్న అంతర్మథనమిది
కాంగ్రెస్‌ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న చిరంజీవిని ఎదగనీయకుండా ఆయన చుట్టూ ఒక కోటరీ ఏర్పడిం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి చిరంజీవికి రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయాలతో పాటు, ఇతర పార్టీ పరిణామాలేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ, ఆయన చుట్టూ చేరిన కొందరు నేతలు ఆయన చుట్టూ అడ్డుగోడలా నిలుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీఆర్పీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఈ జూనియర్‌ శక్తులు తాము ఒక్కరే చిరంజీవి దృష్టిలో మేధావులుగా ముద్ర వేయించుకోవాలన్న దూరదృష్టితో ఇతరులను రానీయకుండా సైంధవ పాత్ర పోషిస్తున్నారంటున్నారు. పైగా తమకు అనుకూలంగా ఉండే వారిని చుట్టూ నియమించే వ్యూహంతో ఉన్నారు.

ఇటీవల తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఇతర జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం తమ మనోభావాలు తెలిపేందుకు ప్రయత్నించగా, సదరు జూనియర్‌ మేధావులే చిరంజీవికి అడ్డుగోడగా నిలిచారన్న ఆరోపణలున్నాయి. చిరంజీవి వద్ద కొత్త వారు చేరితే తమ పట్టు ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతోనే ఈ జూనియర్‌ మేధావులు అటు సీనియర్‌ నాయకులను, ఇటు జర్నలిస్టులను చిరు వద్దకు చేరకుండా సైంధవపాత్ర పోషిస్తున్నారంటున్నారు. గతంలో ఎలాంటి రాజకీయానుభవం గానీ, రాష్ట్ర స్థాయి రాజకీయాలను విశ్లేషించే అనుభవం గానీ లేని ఈ జూనియర్‌ మేధాలవుల వల్ల చిరంజీవి ఒక చట్రంలో ఇరుక్కుపోతున్నారన్న ఆవేదన పీఆర్పీ నేతల్లో వ్యక్తమవుతోంది. వీరిని వదిలించుకుని, అందరితో మమేకం కాకపోతే కాంగ్రెస్‌లో మనుగడ కష్టమంటున్నారు.

ఇక ధృతరాష్ట్ర కౌగిలి వంటి కాంగ్రెస్‌ నీడలో చిరంజీవి ఉన్నంతకాలం ప్రతిదీ సునిశితంగా పరిశీలించాలంటున్నారు. చిరంజీవి కాంగ్రెస్‌లో చేరినందున కాపులు కాంగ్రెస్‌కు పెద్ద ఓటు బ్యాంకుగా మారారు. ఇది కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కమ్మ, రెడ్డి, దళిత వర్గాల నాయకులకూ కలసిరానుంది. ప్రతి నియోజకవర్గంలోనూ కాపుల ఓట్లు కనీసం 20-25 వేల వరకూ ఉన్నాయి. తమ సామాజికవర్గ ఓట్లతో పాటు కాపు ఓట్లు కూడా అనుకూలిస్తేనే తాము గెలుస్తామన్న ముందుచూపుతో చాలామంది కాపేతర నాయకులు, మంత్రులు సైతం చిరంజీవి సాన్నిహిత్యం కోసం తపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో తూర్పు కాపుల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చిరు తమ వైపు ఉంటే బయటపడతామన్న భావనతో ఉన్నారు. అయితే, ఈ వాస్తవాన్ని గ్రహించకుండా, చిరంజీవిని కేవలం ఒక కాపులకే పరిమితం చేసి, ఆయనను కొందరివాడిగా చేసే ప్రయత్నాలు సొంత కోటరీ లోనే జరుగుతోందంటున్నారు.

చిరంజీవి కంటే దశాబ్దాల ముందే రాజకీయాల్లో ఉంటూ కాపు నాయకులుగా ముద్ర పడిన వంగవీటి మోహనరంగా, ముద్రగడ పద్మనాభం వంటి పెద్ద నేతలకు ప్రజాకర్షణ, ఇమేజ్‌ ఉన్నప్పటికీ కేవలం కాపు నేతలన్న కుల ముద్ర ఉండటం వల్లే రాణించలేకపోయారని విశ్లేషిస్తున్నారు. వంగవీటి జీవించినంతకాలం పోరాడగా, ముద్రగడను ఇప్పటికీ ఏ రాజకీయపార్టీ ఆదరించేందుకు సాహసించలేకపోతోందని గుర్తు చేస్తున్నారు. నిజానికి, చిరంజీవి పీఆర్పీ స్థాపించిన తర్వాత కాపులకు గుర్తింపు కంటే రాజకీయంగా నష్టమే ఎక్కువ జరిగిందన్న ఆవేదన ఇప్పటికీ వినిపిస్తోంది. కాంగ్రెస్‌-టీడీపీలో ఒక వెలుగు వెలిగి.. వైఎస్‌, బాబు ఎంత నచ్చచెప్పినా వినకుండా కేవలం కులాభిమానంతో ఆయా పార్టీలకు రాజీనామా చేసి మరీ బయటకువచ్చిన వారి రాజకీయ జీవితాలు ప్రస్తుతం డోలాయమానంలో పడ్డాయని విశ్లేషిస్తున్నారు.

కొత్తపల్లి సుబ్బారాయుడు, మళ్లీ టీడీపీలో చేరిన కళావెంకట్రావు, కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన బూరగడ్డ వేదవ్యాస్‌ వంటి సీనియర్లు ఆయా పార్టీల్లోనే కొనసాగిఉంటే వారికి కనీస గుర్తింపయినా వచ్చి ఉండేదంటున్నారు. ఈ దృష్ట్యా కులముద్ర వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువంటున్నారు.
చిరంజీవికి 17 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్న కారణంతోనే కాంగ్రెస్‌ ఆయన పార్టీని విలీనం చేసుకుని రెండు పదవులు ఇచ్చింది తప్ప, చిరుపై ప్రేమతో కాదన్నది నిర్వివాదం. అయితే, చిరంజీవి విస్తరణ సమయంలో కేవలం ఇద్దరినే సిఫారసు చేయడం ద్వారా మిగిలిన వారిని దూరం చేసుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శాసనసభలో ఉన్న ఆ కొద్దిపాటి న్యాయపరమైన చిక్కు కూడా తొలగిపోతే, ఇక అంతా అధికారికంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలవుతారు. అప్పుడు చిరంజీవి వెంట ఉన్న ఇప్పటి 14 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట శాశ్వతంగా ఉంటారన్న నమ్మకం లేదు. కాంగ్రెస్‌లో ఢిల్లీ లాబీ ఉన్నవారికే పదవులు వస్తాయి కాబట్టి, అంతా ఢిల్లీలోనో, ఇక్కడ సీఎం స్థాయిలోనో కొత్త గాడ్‌ఫాదర్లను ఎంచుకుంటారు. ఇప్పటికే కొందరు నేరుగా సీఎంతో సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే.

అప్పుడు చిరంజీవికి సొంతంగా ఎలాంటి బలమూ ఉండదు. మళ్లీ కాంగ్రెస్‌లోనే కొత్త శక్తులను సమీకరించుకోవలసి వస్తుంది. చిరు మనస్తత్వం ప్రకారం అది చాలా కష్టమని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. సొంత బలం, బలగం లేకపోతే కాంగ్రెస్‌లో గుర్తింపు కష్టం. ఈ క్రమంలో చిరంజీవి సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం భవిష్యత్తులో ఎప్పటికయినా మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. విస్తరణలో చిరు సిఫారసు వల్ల సొంత పార్టీ నేతలు ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా అధికారికంగా కాంగ్రెస్‌లో విలీన వార్త కోసం ఎదురుచూస్తున్నారు. అది పూర్తయితే ఇక చిరంజీవిని విడిచి కాంగ్రెస్‌లో కొత్త దేవుళ్ల కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది. ప్రజాకర్షణ, నిబద్ధత ఉన్న ఎన్టీఆర్‌ లాంటి ఇమేజ్‌ ఉన్న వారే రాజకీయాల్లో తప్పటడుగులు వేస్తే తిరుగుబాటు తప్పలేదని, రెండేళ్లు కూడా పార్టీని నడిపించలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటున్న చిరంజీవి అన్న గారి కంటే ఎక్కువకాదని చిరు ఎదుగుదలను కోరుకునే ఆయన సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు.

మనకు ముఖ్యమంత్రి పోస్ట్ వస్తుంది

మనకు ముఖ్యమంత్రి పోస్ట్ వస్తుంది

మనం నెట్వర్క్ కవలస్నిన అవసరం వుంది

మనం నెట్వర్క్ కవలస్నిన అవసరం వుంది

కమ్మ-రెడ్డి వర్గాలు కలసి కాపులపై

కాంగ్రెస్‌లో ‘కుల’ కులం రేగింది. కమ్మ-రెడ్డి వర్గాలు కలసి కాపులపై యుద్దం ప్రకటించాయి. కాపులు సైతం దానిని ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవలి కాలంలో కాపు వర్గానికి పెరుగుతున్న ప్రాధాన్యతను అడ్డుకునేందుకు ఆ రెండు వర్గాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ఫలితంగా కాంగ్రెస్‌లో కుల సమీకరణ లు ఆసక్తికరంగా మారుతున్నాయి. చిరంజీవి రంగప్రవేశంతో కాంగ్రెస్‌లో మొన్నటి వరకూ పెద్దగా గుర్తింపు లేని కాపులకు ఎక్కడ లేని ప్రాధాన్యం లభిస్తోం ది. ఆయన సిఫారసు చేసిన ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చారు.
చిరంజీవిని అత్యంత కీలకమైన సమన్వయ కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పించారు. అదే సమయంలో సాంకేతికంగా బీసీలయినప్పటికీ, మానసికంగా తామూ కాపులుగా చెలామణి అవుతున్న తూర్పు కాపు, మున్నూరు కాపు వర్గానికి చెందిన డి.శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ కూడా సమన్వయ కమిటీలో ఉండటంతో కాపులుగా భావిస్తున్న వారి సంఖ్య మూడుకు చేరినట్టయింది. పార్టీలో తమ కులాలకు ప్రాధాన్యం తగ్గించడాన్ని రెడ్డి-కమ్మ సామాజికవర్గం సహించలే పోతోంది. దశాబ్దాల పాటు పార్టీపై ప్రత్యక్ష పెత్తనం సాగించి, ముఖ్యమంత్రి పదవులను వరసగా సాధించిన రెడ్డి సామాజికవర్గం తాజా పరిణామాలతో కుతకు తలాడుతోంది. తాజాగా కమ్మ వర్గానికి చెందిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీలో సీనియర్లకు ప్రధానంగా కమ్మ వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘జగన్‌ ప్రజాదరణ ఉన్న నాయకుడు. కమ్మవారిని టాయిలెట్‌ పేపర్‌లా వాడుకుని వదిలేస్తున్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం తగ్గిస్తున్నారు.

వారికి ప్రాధాన్యం ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందని ’ వ్యాఖ్యానించారు. నిజానికి రాయపాటి చాలాకాలం నుంచీ అసంతృప్తితోనే ఉన్నారు. తాను సీనియర్‌ అయినప్పటికీ, పార్టీ తనకు పదవులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఉడికిపోతున్నారు. దానికితోడు తన ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని రాయపాటి జీర్ణించుకోలేకపోతున్నారు. గుంటూరు-కృష్ణా-ప్రకాశం జిల్లాల్లోని కాపు వర్గంలో పలుకుబడి, పట్టు ఉన్న కన్నాకు గుర్తింపు ఇవ్వడం రాయపాటికి సుతరామూ న చ్చడం లేదు.

kapusఅందుకే ఆయన అనేకసార్లు కన్నాపై అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా తన పార్లమెంటు పరిథిలోని పత్తిపాడుతో పాటు, జిల్లాలోని మాచర్ల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కన్నాపైనే ఉందని నేర్పుగా బంతిని ఆయన వైపు నెట్టేశారు. నిజానికి, తన ఎంపీ నియోజకవర్గ పరిథిలోని పత్తిపాడులో కన్నా జోక్యం చేసుకుంటున్నారని గతంలో కిరణ్‌, బొత్సకు రాయపాటి, ఆయన సోదరుడు శ్రీనివాస్‌, మంత్రి డొక్కా ఫిర్యాదు చేశారు. దానితో జోక్యం చేసుకోవద్దని వారిద్దరూ కన్నాకు సూచించారు. అదేసమయంలో పత్తిపాడు సీఐను కూడా మార్చి, రాయపాటి తను కోరుకున్న వ్యక్తిని తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో కన్నా పత్తిపాడుపై దృష్టి సారించడం మానేశారు. అయితే కమ్మ వర్గం 50 వేలు, కాపులు 35 వేల మంది రెడ్లు 17 వేల మంది ఉన్న అక్కడి ఓటర్లలో.. గెలుపును నిర్దేశించే కాపులు తనకు సహకరించరన్న ముందు జాగ్రత్తతోనే, రాయపాటి అక్కడి అభ్యర్ధి విజయం కన్నాపైనే ఉందని లౌక్యంగా ప్రకటించారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ కన్నా మాత్రం.. తనను జోక్యం చేసుకోవద్దని ఫిర్యాదు చేసిన రాయపాటి అక్కడ అభ్యర్ధి ఎంపిక, గెలుపు బాధ్యతను భుజాన వేసుకోవాలని పార్టీకి స్పష్టం చేసినట్లు సమాచారం.

అదీగాక.. తాజాగా నర్సరావుపేటలో జరిగిన కమ్మసభలో తామంతా కలసి ఉండాలని చంద్రబాబును కోరానని బహిరంగంగానే చెప్పారు. అసలు రాయపాటి ఎప్పుడూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఎంపీ నిధులు ఇవ్వరని, కమ్మ వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలకే ఇస్తారని కన్నా వర్గం మొదటి నుంచీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ రకంగా గుంటూరు జిల్లాలో కమ్మ-కాపు మధ్య పోరు జరుగుతోంది. అటు మరో సీనియర్‌ ఎంపీ కావూరి సాంబశివరావు కూడా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితోనే ఉన్నారు. తనకంటే జూనియర్‌ అయిన పురంధీశ్వరికి కేంద్రంలో చోటివ్వడాన్ని ఆయన తొలి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తాజాగా కాపు కోటా నుంచి చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తారన్న వార్తలు కావూరిని ఆగ్రహంతో రగిలిస్తున్నాయి.

మొదటి నుంచీ పార్టీ జెండాను మోస్తున్న తమను కాదని, మధ్యలో వచ్చిన కొత్తవారిని అందలం ఎక్కించడం ఆయనకు నచ్చడం లేదు. రాయపాటి, కావూరి ఇద్దరూ అనేక సందర్భాల్లో తమ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందంటూ బాహాటంగానే ఆక్రోశం వెళ్లగక్కారు. చిరంజీవికి కేంద్రమంత్రి పదవితో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా కేవలం పీఆర్పీకే మంత్రివర్గంలో చోటు కల్పించే యత్నంపై వారిద్దరూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు కూడా నాయకత్వ వైఖరిపై విరుచుకుపడ్డారు.

‘కృష్ణా జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట. కమ్మ సామాజికవర్గం పార్టీని ఎప్పుడూ ఆదుకుంటూనే ఉంది. అయినా మాపై నిర్లక్ష్యం. ఇప్పుడు పదవులు ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తారంటున్నారు. ఏం చేయాలి? పదవులు అడుక్కోవాలా? మేం ఏ మొహం పెట్టుకుని జిల్లాకు వెళ్లాల’ని పాలడుగు నిలదీసినంత పనిచేశారు. చిరంజీవి వ ర్గీయులకు మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించడం లేదని, అయితే సీనియర్లను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. వీరంతా కాపు వర్గానికి పెద్ద పీట వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక కోస్తా కాంగ్రెస్‌లో సరిపడని కమ్మ-రెడ్లు తాజా పరిణామాల నేపథ్యంలో ఒక్కటయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని దశాబ్దాల నుంచి పార్టీని శాసించిన రెడ్డి వర్గానికి చిరంజీవి రాకతో గొంతులో వెలక్కాయపడినట్టయింది. వరసగా ముఖ్యమంత్రి పదవులను చేజిక్కించుకుంటున్న రెడ్లకు.. ఇటీవలి కాలంలో కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం రుచించడం లేదు.

జగన్మోహన్‌రెడ్డి వైపు రెడ్లు వెళుతున్నందున ఇక రెడ్లకు ప్రాధాన్యం తగ్గించాలని నాయకత్వం నిర్ణయించడంపై అసంతృప్తితో ఉన్నారు. జగన్‌ సాకుతో తమను అణచివేసి, కాపులను అందలం ఎక్కించే పథకాన్ని అడ్డుకునేందుకు రెడ్డి వర్గీయులు రంగంలోకి దిగారు. రెడ్లను పక్కకుపెడితే పార్టీ ఇంకా నష్టపోతుందని నాయకత్వంపై ఒత్తిడి చేసే పనిలో ఉన్నారు.అదే సమయంలో తమ ఒకరి పోరాటంతోనే ఇది సాధ్యం కాదని గ్రహించిన రెడ్డి వర్గం, కమ్మ వర్గాన్ని సమన్వయం చేసుకుని కాపులపై యుద్ధానికి నడుంబిగిస్తోంది. తాజాగా సీనియర్‌ నేత, వివాదరహితుడిగా పేరున్న మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే రెడ్లు పార్టీ నాయకత్వంపై అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి.

జగన్మోహన్‌రెడ్డికి జనబలం ఉందని, ఆయనకు జనబలం లేదని తానెప్పుడూ అనలేదని వ్యాఖ్యానించారు. ‘జగన్‌కు నాయకత్వ లక్షణాలు లేవని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఆయన సభలకు జనం వస్తున్నారు. సీనియర్ల సేవలు అవసరం లేదని నాయకత్వం భావిస్తున్నట్లుంది. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్‌ ఇవ్వకపోయినా నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేయను. రాజకీయాల్లో కులభావన పెరుగుతోంది. క్యాబినెట్‌లో తెలంగాణకు దామాషా ప్రకారం మరికొన్ని పదవులు ఇవ్వవలసి ఉంది’ అని గాదె వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాపులకు నాయకత్వం ఇస్తున్న అధిక ప్రాధాన్యంపై అసంతృప్తి స్పష్టమవుతోంది.
దానికితోడు.. కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే రెడ్లు మొత్తం జగన్‌కు జై కొడతారన్న హెచ్చరిక కూడా ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తోంది. అయితే, గాదె చేసిన వ్యాఖ్యలను రాయపాటి స్వాగతించి, మద్దతు తెలపడం చూస్తే ఆ రెండు సామాజికవర్గాలు ఒక్క తాటిపైకి వచ్చి కాపులపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

అటు కాపు వర్గం కూడా రెడ్డి-కమ్మ వర్గంపై కత్తులు నూరుతోంది. కాంగ్రెస్‌ పార్టీని దశాబ్దాల నుంచి శాసిస్తోన్న రెడ్లు, జనాభా సంఖ్య తక్కువయినా.. అంతకుమించి గౌరవం పొందుతున్న కమ్మ వర్గం ఇంకా పెత్తనం చేయాలని భావించడం సరికాదని కాపు నేతలు వాదిస్తున్నారు. 10 శాతం జనాభా ఉన్న తమను కాంగ్రెస్‌ నాయకత్వం దశాబ్దాల నుంచి దన్నుగా నిలుస్తున్నప్పటికీ, తమను నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేస్తున్నారు.

అయినప్పటికీ, తాము మౌనంగా ఉన్నామని, ఇప్పుడు తమకు అవకాశం వచ్చినప్పుడు రెడ్డి-కమ్మ వర్గీయులు అడ్డుపడటంపై కాపు వర్గం మండిపడుతోంది. చిరంజీవి వచ్చిన తర్వాత తమకు ప్రాధాన్యం పెరిగితే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్‌ వైపు రెడ్లు వెళుతున్నందున ఇంకా ఆ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం అవివేకమని, ఇప్పుడు రెడ్డి వర్గానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్నికల సమయంలో వారంతా జగన్‌ వైపు వెళతారని స్పష్టం చేస్తున్నారు. కమ్మ వర్గం కూడా టీడీపీ వైపు వెళుతుందని, ఆ క్రమంలో ఒక్క కాపులు మాత్రమే పార్టీకి దన్నుగా నిలుస్తారని విశ్లేషిస్తున్నారు. అందువల్ల కాపులకు అవకాశాలు ఇవ్వడంలో తప్పేమీ లేదంటున్నారు.

అంతకు ముందు.. కాపులకు కాంగ్రెస్‌ పార్టీలో అన్యాయం జరుగుతోందని, ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాపులను అణచివేస్తూ సొంత వర్గానికి పెద్ద పీట వేస్తు న్నారని కాపునాడు రాష్ట్ర నేత మిరియాల వెంకట్రావు బాహాటంగా ఆరోపించిన విషయం తెలిసిందే. పైగా కన్నా, వ ట్టి వంటి వారికి అప్రాధాన్య శాఖలు ఇచ్చారని, బొత్స ఎదుగుదలను సీఎం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మిరి యాల నేరుగా రెడ్లపైనే తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం స్పష్టమవుతోంది.

తమకు రాక రాక వచ్చిన అవకాశాన్ని రెడ్డి-కమ్మ నేతలు ఒక పథకం ప్రకారం అడ్డుకోవడంతో దాన్ని తిప్పికొట్టాలని కాపు నేతలు నిర్ణయించుకున్నారు. దానికి కాపు సంఘాలను కూడా వినియోగించుకోనున్నారు. ఈ విషయంలో తాము ఎంతవరకయినా వెళ్లాలని తీర్మానించుకున్నారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలోని రెడ్డి-కమ్మ వర్గాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని.. నాయకత్వాన్ని చేజిక్కించుకుని, కాంగ్రెస్‌లో పైచేయి సాధించాలని నిర్ణయించుకున్నట్లు వారి మాటల ధోరణి స్పష్టమవుతోంది.

నిశబ్దం గా మరో చరిత్ర ను సృష్టించండి

నిశబ్దం గా మరో చరిత్ర ను సృష్టించండి

కాపులకి ఇప్పుడు కలసినది ఏమిటి

కాపులకి ఇప్పుడు కలసినది ఏమిటి

కాపులకు గండి!

బీసీ, ఎస్సీలను సమన్వయం చేసుకుని తమ చిరకాల వాంఛితమైన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్న కాపుల కలలు కల్లలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ప్రాంతంలో అంబేద్కర్‌ విగ్రహాలను కూల్చివేయటంతో ఎస్సీ, బీసీ-కాపుల మధ్య మరింత దూరం పెరిగినట్ట యింది. ఆ ఘటనకు కారకులు ఎవరన్నదీ ఇంకా తేలక పోయినప్పటికీ, కాపుల హస్తమే ఉందని బడుగులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కాపు లు- బీసీ, ఎస్సీల మధ్య ఆది నుంచి కులవైరం కొన సాగుతున్న విషయం తెలిసిందే. కోస్తాలో కాపులు అగ్ర కులంగానే చెలామణి అవుతున్న విషయం తెలిసిందే.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ప్రాంతంలో సోమవారం నాలుగుచోట్ల అంబేద్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన వెనుక కాపు సామాజికవర్గం హస్తం ఉందని ఎస్సీ, బీసీ వర్గాలు బాహాటంగానే ఆరోపి స్తున్నాయి. బీసీలు ఉంచిన కొన్ని ఫ్లెక్సీలను కూడా చించి వేశారన్న వార్తలు వెలువడ్డాయి. దీనికి నిరసనగా ఎస్సీ వర్గాలంతా కాపులు డౌన్‌ డౌన్‌ అంటూ బాహాటంగానే నినాదాలు చేశారు. వారికి స్థానికంగా ఉన్న బీసీ వర్గాలు కొన్ని మద్దతుగా నిలిచాయి. తరతరాలుగా కాపులు తమపై దోపిడీ, దౌర్జన్యాలు చేస్తున్నా, ప్రభుత్వాలు కాపు ఓట్లకు భయపడి చర్యలు తీసుకునే ధైర్యం చేయడం లేదని విరుచుకుపడుతున్నారు.

సోమవారం నాటి ఘటనకు కారకులయిన వారిని శిక్షించమని డిమాండ్‌ చేసిన తమపైనే పోలీసులు దౌర్జన్యం చేయడం అన్యాయమని, కాపు ప్రజాప్రతి నిధులు పోలీసులపై ఒత్తిడి చేసి తమ ఆందోళనను అణచివేస్తున్నారని దళిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. న్యాయం కోసం వెళితే తమకు అన్యాయం ఎదురయిం దని విరుచుకుపడుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. కోస్తాలో బీసీ, ఎస్సీ లను సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పదవి సాధించాలన్న పట్టుదలతో అడుగులు వేస్తున్న కాపు సా మాజికవర్గ నాయకుల స్పీడుకు బ్రేకులు పడినట్టయింది. నిజానికి కోస్తాలో బీసీ, ఎస్సీలకు కాపులకు సరిపడదు. ఈ వర్గాల మధ్య అనాదిగా శత్రుత్వం కొనసాగుతోంది. అయితే, దశాబ్దాల నుంచి జనాభాలో 8 శాతం కూడా లేని రెడ్డి-కమ్మ వర్గాలే పెత్తనం చేస్తూ, 10 శాతం జనాభా ఉన్న తమకు అన్యా యం చేస్తూ సీఎం సీటు రాకుండా కర్రపెత్తనం చేస్తు న్నాయన్న అసంతృప్తితో కాపు నేతలు రగిలిపోతున్నారు.

ఇప్పుడు తమ సామాజికవర్గానికి చెందిన చిరంజీవి రావ డం, కాపులతో సమన్వయం చేసుకుని వెళుతున్న బొత్స సత్యనారాయణ పీసీసీ చీఫ్‌ కావడంతో కాపులలో ఆశలు చిగురించాయి. బీసీ, ఎస్సీలను సమన్వయం చేసుకుని వెళితేనే కాపులు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలుంటా యని గ్రహించిన కాపు నేతలు, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలోనే బీసీ అయిన బొత్స సత్యనారా యణను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అణచివేస్తున్నా రని కాపునాడు అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు ఆరోపించటం తెలిసిందే. బీసీలతో ఏ మాత్రం సంబంధం లేని కాపునాడు హటాత్తుగా బీసీకి చెందిన బొత్సకు అన్యా యం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేయడం వెనుక బీసీలను సమన్వయం చేసుకుని సీఎం పదవి సాధిం చాలన్న ఎత్తుగడ సుస్పష్టమని బీసీ నేతలు వ్యాఖ్యా నించడం గమనర్హం.

అయితే, బీసీలు-కాపులు కలిసే సమస్యే లేదని బీసీ నేతలు కుండబద్దలు కొట్టినట్లు అప్పుడే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో.. కాపు నేతల మంత్రాంగం బెడిసికొట్టి నట్టయిందని బీసీ నేతలు విశ్లేషిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజ, యా దవ, మత్స్యకారులు ఒక జట్టుగా కాపులు మరొక జట్టుగా నిలు స్తుంటారు. సోమవారం అంబేద్కర్‌ విగ్రహాల విధ్వంసం వెనుక ఎవరున్నదీ ఇంకా స్పష్టం కాకపోయినప్పటికీ, కాపులే కారణమని ఎస్సీ, బీసీలు బాహాటంగా పొలీసు స్టేషన్‌ వద్ద జరిగిన ధర్నాలోనే ఆరోపించారు. దీన్ని బట్టి.. భవిష్యత్తులో బడుగు వర్గాలను సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పదవి సాధించాలన్న కాపుల వ్యూహం నెర వేరడం కష్టమని ఇప్పటి పరిణామాలు స్పష్టం చేస్తున్నా యని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదిలాఉం డగా.. ఆదివారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశం ముందు.. కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, దళితులను విస్మరించడంపై అమలాపురం ఎంపీ హర్షకు మార్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘2009 ఎన్నికల్లో దళితుల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి వచ్చింది. మా చేతిలో ఓడిన వాళ్లకు మంత్రి పదవులిచ్చి, మా సామాజిక వర్గానికి చెందిన వారిని మంత్రి పదవి నుంచి తొలగిం చారు. ఆజాద్‌ ఉద్దేశపూర్వకంగా మాలలను దూరం పెడు తున్నార’’ని హర్షకుమార్‌ చేసిన వ్యాఖ్యలు కోస్తాలో, ప్రధా నంగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావితం చేశాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తమ చేతులో ఓడిన పీఆర్పీకి, అది కూడా కాపులకు మంత్రి పదవులు ఇవ్వ డాన్ని ఆయన తప్పుపట్టారు. దాని ఫలితంగానే సోమ వారం నాటి ఘటనలని పోలీసు వర్గాలు అంచనా వేస్తు న్నాయి. హర్షకుమార్‌కు హెచ్చరికగానే కాపులు ఈ విధ్వం సానికి పాల్పడినట్లు ఎస్సీలు కూడా అనుమానిస్తున్నారు.

ఇదిలాఉండగా.. అటు కమ్మ-రెడ్డి వర్గాలు కూడా ఒక్క తాటిపైకి వచ్చి కాపులను ఎదుర్కొనేందుకు సిద్ధమవు తున్నారు. ఆ మేరకు తమ మధ్య ఉన్న వైరాన్ని కూడా పక్కకుపెట్టి, కాపులకు అందలం దక్కకుండా కొత్త వ్యూహా లకు తెరలేపారు. రెడ్డి నేతలు చేసిన వ్యాఖ్యలను కమ్మ వర్గీ యులు సమర్థించడం, కమ్మ నేతలు చేసిన వ్యాఖ్యలకు రెడ్డి వర్గీయులు మద్దతు ప్రకటించడం అందులో భాగం గానే కనిపిస్తోంది. ఇటీవల గాదె వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్య లను గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు సమ ర్థించిన విషయం తెలిసిందే. మొత్తానికి అటు బీసీ- ఎస్సీలు, ఇటు రెడ్డి-కమ్మ వర్గాలు కలసి కాపులను ఎదు ర్కొనేందుకు ఒక్కటవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

నాయుడు అంటే రంగ చిరు మాత్రమే కాదు

నాయుడు అంటే రంగ చిరు మాత్రమే కాదు ... మన కులానికి వెయ్యేళ్ళ చరిత్ర వుంది ,,,,,ప్రతి ఒక్కరు ఒక రంగ ..

మన వాళ్ళు అంత సివిల్స్ వైపు వెళ్ళండి

మన వాళ్ళు అంత సివిల్స్ వైపు వెళ్ళండి ..అటే ఫుతురె అంత వుంటుంది ..

కాపా? బీసీనా?

:పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీసీనా? కాపు నాయకుడా? ఆయన ఎవరికోసం పనిచేస్తున్నారు? కాపు లతో బీసీలకు వైరం ఉన్న నేపథ్యంలో సీఎం సీటు కోసం సత్తిబాబు బీసీకార్డును కాపులకార్డుతో కలిపివేసే వ్యూహం లో ఉన్నారా? సాంకేతికంగా బీసీ అయిన బొత్స కాపుల సర్వేకు ఒత్తిడి చేయడమేమిటి? పట్టుపట్టి 22 లక్షలు విడు దల చేయించడమేమిటి? బీసీల సర్వేకు నిధులకోసం ఎందు కు ఒత్తిడి చేయకుండా మౌనం వహిస్తున్నారు? కాపులకోసం ఎందుకు కలవరిస్తున్నారు?.. ఇప్పుడు కాంగ్రెస్‌లోని బీసీల ను గందరగోళపరుస్తున్న ప్రశ్నలివి. పీసీసీ అధ్యక్షుడు బొత్స బీసీనా? కాపా? ఓసీనా? అన్న ప్రశ్నలు కాంగ్రెస్‌లోని బీసీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సాంకేతికంగా తూర్పు కాపు వర్గానికి చెందిన సత్తిబాబు, మంత్రివర్గంలో బీసీ కోటాతోనే చేరారు. ఉత్తరాంధ్రలో బలమైన కొప్పుల వెలమ, గవర, కళింగ, మత్స్యకారులతో పాటు తూర్పు కాపు కూడా బలమైన సామాజికవర్గమే.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ మూడు కులాలు బలమైనవి. వాటిలో మూడు జిల్లాల్లోనూ కొప్పుల వెలమ- తూర్పు కాపుల సంఖ్యాబలం ఎక్కువ. బీసీల్లో ఈ రెండే బలమైన వర్గాలు. అలాంటి తూర్పు కాపు వర్గానికి చెందిన సత్తిబాబు పీసీసీ అధ్యక్షుడు అయ్యేందుకు చాలాకాలం బీసీకార్డును ఉపయోగించిన విషయాన్ని పార్టీలోని బీసీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవిని సాధించేందుకు ఉత్తరాంధ్రలోని బీసీ కులాలతో పాటు, తెలంగాణలోని మున్నూరు కాపు కులాలకు చెందిన నాయకులను సమన్వయం చేసుకుని ఆ పదవి సాధించారని చెబుతున్నారు. తీరా పీసీసీ అధ్యక్ష పదవి సాధించాక సత్తిబాబు వ్యవహారశైలి పూర్తిగా మారిందని బీసీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఓడ దాటేవరకు ఓడమల్లన్న ఓడదాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు, బీసీలమీద నిర్లక్ష్యభావంతో వ్యవహరిస్తున్నారని బీసీ నేతలు ధ్వజమెత్తారు.

పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి మీద కన్నేసిన సత్తిబాబు అందుకోసం ఇక బీసీల మద్దతు అవసరం లేదన్న భావనతో కాపులకు దగ్గరవుతున్నారని విశ్లేషిస్తున్నారు. బొత్స చేస్తున్న హడావిడి తీరు చూస్తే అసలు ఓసీ కాపుగానే కనిపిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. తన ముఖ్యమంత్రి పదవి కలల సాకారం కోసం కాపు-బీసీలను కలపాలన్న తపనతో పనిచేస్తున్నారని, కానీ అది జరిగే పనికాదంటున్నారు. ఇటీవల కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు మీడియతో మాట్లాడుతూ, బొత్సను సీఎం కిరణ్‌ అణచివేస్తున్నారని ఆరోపించడాన్ని బీసీ నేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అసలు బీసీలతో ఎలాంటి సంబంధం లేని కాపునాడు.. బీసీ అయిన బొత్సకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందడమే వింతగా ఉందని, దీనివెనుక బొత్స తాపత్రయం, వ్యూహమేమిటో స్పష్టమవుతోందని బీసీ నేతలు విశ్లేషిస్తున్నారు.

అసలు కాపులే రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితిని గమనించి మౌనంగా ఉంటుంటే, కాపు నేతగా చెలామణి అయేందుకు ప్రయత్నిస్తున్న బొత్స మాత్రం తానే అసలైన కాపుగా హడావిడి చేస్తున్నారని బీసీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో అసలు కాపులు కూడా బొత్స హడావిడిపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాపులకు- తమకు ఏ విషయంలోనూ సరిపడదని, ఉభయగోదావరి జిల్లాల్లో కాపులు తమపై అనునిత్యం భౌతిక దాడులు చేస్తుంటే తాము కాపులతో కలసి ఎలా పనిచేస్తామని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం సీఎం సీటు కోసమే బొత్స తాను బీసీ అయి ఉండీ కాపుల వెంట తిరుగుతూ కాపు ప్రతినిధితోపాటు.. కాపు-బీసీల ఉమ్మడి నేతగా ప్రచారం చేసుకునే వ్యూహంతో ఉన్నారని చెబుతున్నారు. బీసీల సంక్షేమాన్ని బొత్స విస్మరిస్తున్నారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.

బీసీల సర్వే కోసం 50 కోట్లు కావలసి ఉంది. ఆ మేరకు బీసీ కమిషనర్‌ నాటి సీఎం వైఎస్‌కు నివేదిక ఇచ్చింది. దాన్ని ఇంతవరకూ పరిశీలనలోకి తీసుకోలేదు. ఇప్పటివరకూ నయాపైసా విడుదల చేయలేదు. అయితే, కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌ నేపథ్యంలో.. కాపుల సర్వే కోసం 30 లక్షలు అవసరమని బీసీ కమిషన్‌ చెప్పింది. ఆ మేరకు 22 లక్షల 50 వేల రూపాయలు రెండు విడతలుగా విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. నిజానికి, 2011-2012 బడ్టెట్‌లో 6లక్షల 20 వేలు మాత్రమే కేటాయింపు చూపింది. అయితే నిధుల విడుదలలో మాత్రం అంచనాలకు మించి విడుదల చేసినట్లు స్పష్టమయింది. దానికోసం బొత్స చాలా పోరాడారు.

నాటి సీఎం రోశయ్యకు లేఖ రాయడంతో పాటు, స్వయంగా కలసి ఒత్తిడి చేశారు. కాపుల సర్వేకు నిధుల విడుదల కోసం తాను సీఎంను కలసి ఒత్తిడి చేసిన విషయాన్ని స్వయంగా మీడియాకూ వెల్లడించారు. బొత్స ఒత్తిడి ఫలితంగా కాపుల సర్వే కోసం ప్రభుత్వం 22 లక్షల 50 వేల రూపాయలు విడుదల చేసింది. దీన్ని బట్టి బొత్స తన బీసీ కార్డును పీసీసీ అధ్యక్ష పదవి వచ్చేంతవరకూ వాడుకున్నారని, ఇప్పుడు సీఎం పదవి కోసం కాపు కార్డును వాడుకుంటున్నారని బీసీ నేతలు విరుచుకుపడుతున్నారు. స్వతహాగా బీసీ అయి ఉండీ, బీసీల కోసం కాకుండా కాపుల కోసం పనిచేయడం బీసీలకు ద్రోహం చేయడమేనని ధ్వజమెత్తుతున్నారు. తాజాగా జరిగిన విస్తరణలో కూడా బీసీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని ఒత్తిడి చేయకుండా చిరంజీవి సిఫారసు మేరకు కాపులకు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరిన విషయాన్ని గుర్తు చేస్తూ.. దీన్ని బట్టి బొత్సకు బీసీలపై ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతోందని విమర్శిస్తున్నారు

కాపు వర్గానికి కొమ్ముకాసి వారికే మంత్రి పదవులు

ఎంతోకాలంగా ఉత్సుకత రేపుతున్న కిరణ్‌ కుమార్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణ కొత్త పుంతలు తొక్కింది!. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చక్రం తిప్పి కాపు వర్గానికి కొమ్ముకాసి వారికే మంత్రి పదవులు ఇప్పించారని సమాచారం. దీంతో బడుగులు మండిపడుతున్నారు. బీసీ కార్డుతో అంచెలంచెలుగా ఎదిగిన బొత్సకు తాము బోడి మల్లయ్యలుగా కనిపిస్తున్నామా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి శంకర్రావును అవసరానికి ఉపయోగించుకుని కరివేపాకులా తీసివేశారని దళితులు సైతం నిప్పులు చెరుగుతున్నారు.

రాష్ర్ట మంత్రివర్గంలో కాపు సామాజిక వర్గానికి మంత్రి పదవులు పెంచి, ఇతర సామాజిక వర్గాలను ఖాతరు చేయకపోవడాన్ని అన్ని సామాజిక వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రధానంగా బొత్స తీరును ఖండిస్తున్నాయి. ముఖ్య మంత్రి సీటుపై కన్నేసిన బొత్స వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ బడుగులను బలిపశువులను చేస్తున్నారని తూర్పా రబడుతున్నారు. రా్రష్ట మంత్రివర్గంలో బీసీ ఎమ్మెల్యేలకు సముచిత స్థానం కల్పిస్తారని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తరుణంలో అధిష్ఠానం మొండిచేయి చూపిందని ఆరోపిస్తున్నారు.

కేవలం ఇద్దరని మాత్రమే కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గం లోకి తీసుకోవడం... ఆ ఇద్దరు కూడా బలిజ, కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో తమకు అన్యాయం జరి గిందని బడుగులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్‌ మంత్రివర్గంలో సామాజిక న్యాయం కొరవడిందని బడుగులు రుజువులతోసహా గణాంకాలు చూపుతున్నారు. 52 శాతం ఉన్న బడుగులకు కేవలం పది స్థానాలకే పరిమితం చేసి 12 శాతం అని చెప్పుకుంటున్న కాపు వర్గానికి 8 స్థానాలు ఏ విధంగా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో కన్నా లక్ష్మీనారాయణ, తోట నర్సింహ, వట్టి వసంతకుమార్‌ కాపు వర్గానికి చెందినవారు ఉన్నారనీ, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్‌ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారని గుర్తు చేస్తున్నారు.

tabsకాగా ప్రస్తుతం కొత్తగా మంత్రిపదవులు పొందిన సి రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు కూడా కాపు సామాజిక వర్గానికి చెందివ వారు కావడం గమనార్హం. అయితే మున్నూరు కాపులు మాత్రం బీసీ రిజర్వేషన్లు పొందుతున్నారు.కనుకనే బడుగులు మండిపడుతున్నారు. 37 మంది ఉన్న మంత్రివర్గంలో కులాలపరంగా చూస్తే బడుగులకు ఏ విధంగా అన్యాయం జరిగిందో వివరిస్తున్నారు. రాష్ర్ట జనాభాలో ఐదు శాతం ఉన్న రెడ్లకు 11, 12 శాతం ఉన్న కాపు సామాజిక వర్గానికి 8, 17 శాతం ఉన్న దళితులకు ఐదు స్థానాలు కాగా... 52 శాతం ఉన్న బీసీలకు కేవలం 10 స్థానాలేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తెరవెనుక సూత్రధారి బొత్స సత్యనారాయణ బీసీలకు అండగా నిలుస్తానని గతంలో ప్రకటించిన విధంగా తమ పక్షాన పోరాడాలనీ, తమకు భవిష్యత్‌లో అయినా సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేయాలని బడుగులు కోరుతున్నారు. అయితే బొత్స ఇప్పటి మాదిరీ తమను బోడిమల్లయ్యలుగానే చూస్తే భవిష్యత్‌లో తగిని గుణపాఠం చెపుతామని బడుగులు హెచ్చరిస్తున్నారు.

రిజర్వేషన్లలో... కాపు కోణం

రాష్ర్టంలో ప్రస్తుతం కొనసాగుతోన్న వెనుకబడిన రిజర్వేషన్ల శాతాన్ని 25 నుంచి 50 శాతానికి పెంచాలని ఎంతో కాలంగా బీసీ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా కాపుల్ని బూచీగా చూపించి బీసీ కమిషన్‌ ఈ నెల 28న నిర్వహించనున్న బహిరంగ విచారణను వాయిదా వేసేందుకు రంగం సిద్దమవుతోందనే ప్రచారం ఊపందుకొంది. వాస్తవంగా ఇదే జరిగితే బీసీలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా బహిరంగ విచారణకు తాను కట్టుబడి ఉన్నానని బీసీ కమిషన్‌ చైర్మన్‌ దాల్వా సుబ్రహ్మణ్యం ఇస్తున్న హామీ ఎంత వరకు నిలుస్తుంది? కొన్ని రాజకీయ శక్తులు బీసీలను దొంగదెబ్బ తీసేందుకు తెరవెనుక భాగోతం నడిపి గందరగోళం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా? బీసీ కమీషన్‌ వెనుకబడిన తరగతుల వారికి అనుకూలంగా 25 నుండి 50 శాతానికి రిజర్వేషన్లు పెంచేందుకు చేపట్టే చర్యలకు అడుగడుగున్నా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో నోటిఫికేషన్‌ ఎందుకు జారీచేయాల్సి వచ్చిందనే విషయమై బీసీ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక అందజేయడం ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది.

దీనికి సంబందించిన ఫైల్‌ను సీఎంకుపంపడంతో రాజకీయనాయకులు ఒత్తిడిలు కొంత మేరకు ఫలించాయనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్‌ ఈ నెల 28 జరపాల్సిన బహిరంగ విచరణ జరుగుతుందా? వాయిదా పడుతుందా? అనే మీమాంస అధికారుల్లో సైతం నెలకొందంటే రాజకీయ ఒత్తిళ్లు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతోంది. వాస్తవానికి బీసీ కమీషన్‌ ప్రకటనలో ‘విజ్ఞాపనలు, సూచనలు, అభ్యంత రాలు’ తెలియజేసుకోవచ్చని స్పష్టంగా ప్రకటించి నప్పటికీ సామాజిక న్యాయం జరగాలంటే కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు రిజర్వేషన్లు అవసరమంటూ కొత్తవాదన తీసుకురావడం దుర దృష్టకరమని బీసీలు ఆరోపిస్తున్నారు.

అయితే తమని బీసీ జాబితాలో చేర్చుతామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని కాపులు ఆధారాలు చూపుతున్నారు. అయితే రాష్ర్టంలో వెనుకబడిన కులాలన ధ్రువీకరించమని పుట్టు స్వామి కమీషన్‌ వేస్తే, ఆ కమీషన్‌ పూర్తిస్థాయిలో తేల్చకపోవడంతో సమస్య పునరావృతమవుతోందని కాపులు ఆరో పిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్ని బీసీలుగా గుర్తించాలని చేపట్టిన నిరాహార దీక్ష ఫలితంగా నాటి ప్రభుత్వం దిగివచ్చి పై నాలుగు కులాలతోపాటు మరో పది కులాలను అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి హయాంలో బీసీ జాబితాలో చేర్చారని గుర్తు చేస్తున్నారు.

ఆతర్వాత వచ్చిన ఎన్‌టిఆర్‌ ప్రభుత్వం ఆ జీఓను కొట్టివేయడంతో అప్పటి నుండి కాపులు బీసీ జాబితాలో చోటు సంపాదించుకునేందుకు పోరాడుతూనే ఉన్నారని వివరిస్తున్నారు. ఇప్పటికీ రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న అనేక బీసీ కులాలతో తమకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని రుజువులతో సహా చూపుతున్నారు. కనుక తమని బీసీ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీని వెనుక కాపు రాజకీయ నాయకులు ప్రోద్భలం కూడా ఉందని తెలుస్తోంది. కాగా ఒక కులాన్ని బీసీగా గుర్తించడానికి సామాజికంగా, విద్యా పరంగా వాళ్లు వెనకబడి ఉండాలని ఆర్టికల్‌ 15/4 ప్రకారం రాజ్యంగం నిర్ణయించిన మాటను బీసీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

ఇప్పటికే పెద్దఎత్తున ఇతర కులాలను బీసీ జాబితాలో చేర్చడంతో ఓసీలకు అప్రకటిత రిజర్వేషన్‌ కోటా పెరిగిపో తోందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే బీసీ రిజ ర్వేషన్ల కోటా పెరిగే అవకాశాలు మెరగ య్యాయని ఆశగా ఎదురుచూస్తున్నవారికి పిడుగు లాంటి వార్త వినిపించిందని ఆందోళన చెందుతు న్నారు. కొందరు రాజకీయ నాయకుల జోక్యంతో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిహ రంగ విచారణ వాయిదాపడే అవకాశాలు ఉన్నా యనే వార్త వారిని మరింత కుంగదీసిందని చెపుతు న్నా రు. అయితే బహిరంగ విచారణ జరిగి తీరు తుందని బీసీ కమీషన్‌ చైర్మన్‌ స్పష్టం చేసినప్పటికీ ఆయన నోటిఫికేషన్‌ ఎందుకు జారీచేయాల్సి వచ్చిందనే విషయమై ప్రభుత్వానికి నివేదిక అంద జేయడం ఆరోపణలకు మరింత బలం చేకూరు తోంది. గందరగోళపరిచే ఈ పరిస్థితిపై వివరణ ఇస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని బీసీ నాయకులు కోరుతున్నారు.